• 6 years ago
The entire political battle has not gone down well with TDP supremo Chandrababu Naidu, who took stock of the situation and summoned members of both factions for a meeting in the capital city this week.


భూమా మౌనికా రెడ్డి మాట్లాడుతూ.. పదేపదే అఖిలప్రియ జోలికి, భూమా కుటుంబం జోలికి వస్తే భూమా కేడర్ చూస్తూ ఊరుకోదని అంటున్నారని, అసలు భూమా కేడర్ ఎక్కడిదని, దానికి తన తండ్రి కారణమని ఏవీ సుబ్బారెడ్డి కూతురు అన్నారు. నేటి భూమా కేడర్ తన తండ్రి చేసిన కృషి అని అభిప్రాయపడ్డారు.
టీడీపీ ఇటీవల సైకిల్ యాత్ర చేపట్టింది. ఆళ్లగడ్డలో ఓవైపు అఖిలప్రియ, మరోవైపు ఏవీ సుబ్బారెడ్డి యాత్ర చేశారు. తనకు పోటీగా సైకిల్ యాత్ర చేయడాన్ని అఖిలప్రియ, ఆమె వర్గం జీర్ణించుకోలేకపోయింది. అంతేకాదు, ఇటీవలి కాలంలో ఏవీ సుబ్బారెడ్డి కూతురు కూడా తెరపైకి వచ్చారు. దీనిని కూడా అఖిలప్రియ జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ఓ వైపు వైసీపీ నుంచి వచ్చిన అఖిలప్రియ, మరోవైపు ఆధిపత్యం కోసం అఖిల వర్సెస్ ఏవీ నేపథ్యంలో టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
కాగా, అఖిలప్రియకు, ఏవీ సుబ్బారెడ్డికి మధ్య విభేదాలపై గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇద్దరి పద్ధతి బాగాలేదని, ఇలాగే ఉంటామంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అఖిలప్రియ వెంట ఆమె సోదరి నాగమౌనిక, నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి ఉన్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు మళ్లీ తనను కలవాలని వారిని ముఖ్యమంత్రి ఆదేశించారు.

#Bhuma Akhila Priya
#Chandra babu Naidu
#AV Subbareddy
#TDP

Category

🗞
News

Recommended