సీఎం అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

  • 6 days ago
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్​ (NTR) భవన్‌లో నేడు పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతను చంద్రబాబు ప్రకటించనున్నారు. ఇప్పటికే రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంటరీ పార్టీ నేత ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే లోక్‌సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై నేటి భేటీలో చర్చించనున్నారు. రాష్ట్రానికి వీలైనన్నిఎక్కువ కేంద్ర నిధులు తీసుకొచ్చేలా కృషి చేయాలని చంద్రబాబు ఎంపీ (MP) లకు దిశానిర్దేశం చేయనున్నారు.